News June 22, 2024

పరీక్షల్లో అక్రమాల నియంత్రణకు చట్టం: కేంద్రం

image

ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(అక్రమాల నియంత్రణ)చట్టం 2024’ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం పొందినట్లు పేర్కొంది. దీని ప్రకారం ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కనిష్ఠంగా 3-5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. వ్యవస్థీకృత మోసాలకు పాల్పడితే 5-10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹కోటి జరిమానా విధించనుంది.

Similar News

News December 18, 2025

SMAT ఫైనల్.. ఝార్ఖండ్ భారీ స్కోర్

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో ఝార్ఖండ్ 20 ఓవర్లలో 262/3 పరుగులు చేసింది. హరియాణా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇషాన్ కిషన్ 101(49B), కుమార్ 81(38B), అనుకుల్ రాయ్ 40(20B), రాబిన్ 31*(14B) అదరగొట్టారు. విజయం కోసం హరియాణా 263 స్కోర్ చేయాల్సి ఉంది.

News December 18, 2025

వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని YCP చీఫ్ జగన్ చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్‌కు సమర్పించి CBN స్కామ్‌ను వివరించామన్నారు. ‘స్కూళ్లు, ఆసుపత్రులను ప్రభుత్వం నడపకపోతే ఆ సేవలు పేదలకు భరించరానివి అవుతాయి. ₹8వేల CRతో 17 కాలేజీలను భూములు సేకరించి కట్టాం. 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మీకు చేతకాకపోతే మేం వచ్చాక పూర్తిచేస్తాం’ అని అన్నారు.

News December 18, 2025

రెచ్చగొట్టే కామెంట్లు చేస్తే NBW.. కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

image

ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే బిల్లును కర్ణాటక అసెంబ్లీ నేడు ఆమోదించింది. కులం/మతం/వ్యక్తిని రెచ్చగొట్టే కామెంట్లకు 1-7ఏళ్ల జైలు, రూ.50వేల ఫైన్ విధిస్తామని బిల్లులో పేర్కొంది. రిపీట్ చేస్తే 2ఏళ్ల జైలు, రూ.లక్ష ఫైన్ వేస్తారు. నేర తీవ్రత ప్రకారం బాధితుడికి పరిహారమిచ్చే అవకాశమూ ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే బిల్లు తెచ్చిందని BJP విమర్శించింది.