News June 5, 2024

తప్పు చేసిన వారిపై చర్యలుంటాయ్: లోకేశ్

image

AP: ప్రభుత్వంలో తన పాత్ర ఏంటో చంద్రబాబు నిర్ణయిస్తారని నారా లోకేశ్ చెప్పారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. వైసీపీ చేసిన తప్పులు చేయకుండా రాష్ట్రాన్ని దారిలో పెడతామన్నారు. ఆస్తుల ధ్వంసం, వేధింపులు, దొంగ కేసులు పెట్టడం తమకు తెలియదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన, తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. విభజన హామీల అమలు కోసం కేంద్రాన్ని అడుగుతామన్నారు.

Similar News

News September 10, 2025

మహిళలు నేడు ఈ వ్రతం చేస్తే చాలా మంచిది

image

నేడు ఉండ్రాళ్ల తద్ది. ఈ వ్రతం గురించి ఆ పరమేశ్వరుడే స్వయంగా పార్వతీ దేవికి వివరించారని చెబుతారు. ఈ వ్రతాన్ని స్త్రీలు భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరిస్తే వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పెళ్లైన మహిళలు భర్త, సంతానంతో కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోమును ఆచరిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా ఆచరించొచ్చని, ఫలితంగా మంచి భర్త దొరుకుతాడని వేద పండితులు అంటున్నారు.

News September 10, 2025

‘ఉండ్రాళ్ల తద్ది’ వ్రతం ఎలా చేయాలి?

image

మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పార్వతీ దేవి సకల సౌభాగ్యాలు వర్ధిల్లే వరమిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘మహిళలు నేడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. బియ్యం పిండితో ఉండ్రాళ్లు చేయాలి. గౌరీ దేవిని పూజించి ఆమెకు ఉండ్రాళ్లు నివేదించాలి. ఐదుగురు ముత్తైదువులను పిలిచి చీర, రవికలతో పాటు ఉండ్రాళ్లు వాయనమివ్వాలి. వారి పాదాలకు పసుపు రాసి, ఆశీస్సులు పొంది, అక్షతలు వేయించుకుంటే శుభం కలుగుతుంది’ అని అంటున్నారు.

News September 10, 2025

‘ఉండ్రాళ్ల తద్ది’.. ప్రాచుర్యంలో ఉన్న కథ

image

పూర్వం ఓ రాజు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు భార్యలున్నా వేశ్య ‘చిత్రాంగి’ పైనే ఎక్కువ అనురాగం ఉండేది. ఓనాడు రాజు భార్యలందరూ ఉండ్రాళ్ల తదియ నోము నోచుకుంటున్నారని ఆమెకు తెలుస్తుంది. ఆమె కూడా ఈ వ్రతం చేయాలని అనుకుంటుంది. రాజు అనుమతితో భాద్రపద తృతీయ నాడు ఉండ్రాళ్లు చేసి, గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టి, కొందరు స్త్రీలకి వాయనమిస్తుంది. ఐదేళ్లపాటు నిర్విఘ్నంగా నోము నోయడంతో వేశ్య అయినా ఆమె సద్గతి పొందింది.