News August 24, 2025

త్వరలోనే బాధ్యులపై చర్యలు: మంత్రి రాంప్రసాద్

image

AP: ‘ఆడుదాం ఆంధ్రా’పై విచారణ పూర్తయిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బాధ్యులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని ఆయన వివరించారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలో అందరూ సమానమే అని పేర్కొన్నారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

Similar News

News February 3, 2026

మోహన్ బాబు, విష్ణుపై కిడ్నాప్ కేసు

image

AP: మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మోహన్‌బాబు, విష్ణు, వర్సిటీ పీఆర్వోపై తిరుచానూరు పీఎస్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి నాయకులపై అక్కడి సిబ్బంది దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు సమాచారం.

News February 3, 2026

‘భోలే బాబా’ను తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి: సత్యకుమార్

image

AP: పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసేలా రూల్స్ మార్చి YCP బరి తెగించిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘TTD నెయ్యి కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కలవలేదని YCP అంటోంది. అంటే కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? కల్తీ అయిందని జగన్ హయాంలో CFTRI తేల్చినా పట్టించుకోలేదు. భోలేబాబా డెయిరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తేలాలి.’ అని పేర్కొన్నారు. CMగా జగన్ అన్యమతస్థులను TTDలో నియమించారని విమర్శించారు.

News February 3, 2026

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

image

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ(<>WDCW<<>>) కర్నూలు 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. PT ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, హౌస్ కీపర్, ఆయా పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ/డిప్లొమా(ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్), టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in