News November 30, 2024
శ్రీవారి ఆలయం ముందు ఫొటోషూట్పై చర్యలు: టీటీడీ

AP: నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయం ముందు ఫొటో షూట్ నిర్వహించిన వంశీనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. రెండు రోజుల క్రితం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వంశీనాథ్ స్వామివారిని దర్శించుకున్నాక గుడి ముందు ఫొటోగ్రాఫర్లతో ఫొటోలు, వీడియోలు తీయించుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇది కాస్త టీటీడీ దృష్టికి రావడంతో స్పందించింది.
Similar News
News December 23, 2025
అడిషనల్ సొలిసిటర్ జనరల్గా కనకమేడల

సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇందులో మాజీ ఎంపీ, అడ్వకేట్ కనకమేడల రవీంద్రకుమార్, దవీందర్పాల్ సింగ్కు చోటు కల్పించింది. వీరు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. కాగా రవీంద్ర కుమార్ 2018 నుంచి 2024 వరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
News December 23, 2025
ఎంపీ, ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు: కేంద్ర మంత్రి

ప్రతి MP, MLA అభివృద్ధి నిధుల్లో కమీషన్ తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాఝీ వ్యాఖ్యానించారు. ‘నేను కూడా కమీషన్ తీసుకున్నాను. దాన్ని పార్టీకి ఇచ్చేవాడిని. మీరు కనీసం 5% కమీషన్ అయినా తీసుకోవాలి’ అని HAM(S) పార్టీ మీటింగ్లో నేతలకు సూచించారు. MPకి ₹5CR వరకు అభివృద్ధి నిధి ఉంటుందని, 10% కమీషన్ తీసుకున్నా ₹40 లక్షలకు పైనే వస్తుందని అన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
News December 23, 2025
జనవరి 1 నుంచి భీమాశంకర్ టెంపుల్ క్లోజ్

జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర్ ఆలయం(MH) 2026 JAN 1 నుంచి మూతపడనుంది. ఆలయ అభివృద్ధి ప్లాన్లో భాగంగా ప్రధాన ఆలయ సభా మండపాన్ని రెనోవేట్ చేయనున్నారు. నిర్మాణ పనులు జరిగే టైంలో భక్తుల సేఫ్టీ దృష్ట్యా ఆలయంలో దర్శనాలను 3 నెలలపాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని ఈ టెంపుల్ ఆధ్యాత్మిక ప్రేమికులకు మాత్రమే కాదు నేచర్ లవర్స్, ట్రెక్కింగ్ చేసే వారికీ ఫేవరెట్ స్పాట్గా ఉంది.


