News November 30, 2024
శ్రీవారి ఆలయం ముందు ఫొటోషూట్పై చర్యలు: టీటీడీ

AP: నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయం ముందు ఫొటో షూట్ నిర్వహించిన వంశీనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. రెండు రోజుల క్రితం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వంశీనాథ్ స్వామివారిని దర్శించుకున్నాక గుడి ముందు ఫొటోగ్రాఫర్లతో ఫొటోలు, వీడియోలు తీయించుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇది కాస్త టీటీడీ దృష్టికి రావడంతో స్పందించింది.
Similar News
News December 20, 2025
క్లీనింగ్ టిప్స్

* నిమ్మకాయను మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని దానిలో కాస్త వంట సోడాను కలిపి సింక్ కొళాయిలకు రాసి అరగంట తరువాత కడిగితే మురికి వదిలిపోతుంది.
* కప్పుల్లో కాఫీ, టీ మరకలు వదలకపోతే వెనిగర్ లో ఉప్పు కలిపి రుద్దితే త్వరగా వదిలిపోతాయి.
* స్టెయిన్ లెస్ స్టీల్ సింక్ మీద నీళ్ళ మరకలు పోవాలంటే వంటసోడాలో వెనిగర్ కలిపి రుద్దాలి. గంట తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే కొత్తదానిలా మెరిసిపోతుంది.
News December 20, 2025
భారీగా పెరిగిన వెండి ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరగ్గా గోల్డ్ రేట్స్ తటస్థంగా ఉన్నాయి. కేజీ సిల్వర్పై ఏకంగా రూ.5,000 పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం KG వెండి రేటు రూ.2,26,000గా ఉంది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,34,180, 22క్యారెట్ల 10gmల గోల్డ్ రేటు రూ.1,23,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 20, 2025
స్పైస్జెట్ ప్యాసింజర్పై ఎయిర్ ఇండియా పైలట్ దాడి!

ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (AIX) పైలట్ ఒకరు తనపై దాడి చేశారని స్పైస్జెట్ ప్యాసింజర్ అంకిత్ దేవాన్ ఆరోపించారు. క్యూ లైన్ దాటుకొని వెళ్లడాన్ని ప్రశ్నించడంతో ఆగ్రహించిన పైలట్ తన ముఖంపై రక్తం వచ్చేలా కొట్టాడని Xలో పోస్ట్ చేశాడు. గాయాలకు సంబంధించిన ఫొటోను కూడా జత చేశాడు. ఘటన సమయంలో పైలట్ విధుల్లో లేనప్పటికీ.. అతణ్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్లు AIX తెలిపింది.


