News December 2, 2024

నటి ఆత్మహత్య.. మామ ఏమన్నారంటే?

image

సీరియల్ నటి శోభిత ఆత్మహత్యపై ఆమె మామ బుచ్చిరెడ్డి స్పందించారు. శోభితను కన్నబిడ్డలా చూసుకున్నామని, తమతో బాగా కలిసిపోయిందని చెప్పారు. తన కుమారుడు సుధీర్ రెడ్డితో అన్యోన్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు. కాగా పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా కర్ణాటకకు తీసుకెళ్లారు.

Similar News

News January 22, 2026

భారత్ అంత చేసినా.. బరితెగించిన బంగ్లా!

image

భారత్‌లో T20 WC ఆడబోమన్న బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. వాస్తవానికి ఆ దేశ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించిందే BCCI. 1988లో BCBకి అప్పటి ICC ఛైర్మన్ జగ్మోహన్ దాల్మియా ICCలో సభ్యత్వం ఇప్పించారు. తర్వాత BCCI ఆ జట్టుకు టెస్ట్ హోదా లభించేలా చేసింది. ఇంకా చెప్పాలంటే 1971లో పాకిస్థాన్‌తో పోరాడి బంగ్లాను స్వతంత్ర దేశంగా చేసిందే భారత్. బంగ్లా తీరుపై మీరేమంటారు?

News January 22, 2026

ఇది లొట్టపీసు కేసు.. బరాబర్ విచారణకు వెళ్తా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులు తప్ప పీకిందేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది లొట్టపీసు కేసు. ఇప్పటివరకు నేను ఆ నోటీసులే చూడలేదు. అయినా బరాబర్ విచారణకు వెళ్తా. ఎవరికీ భయపడేది లేదు. రేవంత్‌కు అసలే భయపడను. మేం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు వదిలిపెట్టం’ అని సిరిసిల్ల ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు.

News January 22, 2026

టెక్ యుగంలో వెండి కీలక లోహం: రాబర్ట్ కియోసాకి

image

వెండికి భవిష్యత్తులో మరింత ఎక్కువ ప్రాధాన్యం వస్తుందని ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. వెండి కేవలం డబ్బుగా కాకుండా టెక్నాలజీ యుగంలో “స్ట్రక్చురల్ మెటల్”గా మారిందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో దీని వినియోగం పెరుగుతోందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ప్రస్తుత టెక్ యుగంలో వెండి అంతే కీలకంగా మారిందని తెలిపారు.