News November 21, 2024

‘అదానీ లంచమిచ్చారు’.. USలో కేసు నమోదు

image

భారత పారిశ్రామికవేత్త గౌతం అదానీ చిక్కుల్లో పడ్డారు. లంచం, ఫ్రాడ్ ఆరోపణలతో న్యూయార్క్‌లో ఆయనతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం భారత అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. US ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా పెట్టుబడులు స్వీకరించారనే ఆరోపణలతో కోర్టు వారెంట్ జారీ చేసింది.

Similar News

News January 2, 2026

మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

image

కొంతకాలంగా తగ్గిన బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో అవైన్ ఇన్ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించారు. దీంతో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అటు నీలగిరి, కోయంబత్తూరు సహా కేరళ సరిహద్దు గల జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. TNలోకి వైరస్ వ్యాపించకుండా కోళ్ల వ్యాన్స్‌ను వెటర్నరీ టీమ్స్ తనిఖీ చేస్తున్నాయి.

News January 2, 2026

ఈ ప్రాణులు భాగస్వామితో కలవగానే చనిపోతాయి

image

ప్రపంచంలో 11 ప్రాణులు తమ భాగస్వామితో కలిశాక చనిపోతాయని BBC వైల్డ్ లైఫ్ పేర్కొంది. అవి.. గ్రీన్ అనకొండ, మగ తేనెటీగలు, అమెజాన్ కప్ప, ఎలుకను పోలిన యాంటిచినుస్ మార్సుపియాల్స్, వాస్ప్ స్పైడర్స్, ఆక్టోపస్, గొల్లభామను పోలిన ప్రేయింగ్ మాంటిస్, పసిఫిక్ సాల్మన్, రెడ్‌బ్యాక్ స్పైడర్స్, లాబర్డ్ ఊసరవెల్లి. కలిసిన సమయంలో అధిక హార్మోన్ల విడుదల, శక్తి కోల్పోవడం, భాగస్వామి తినేయడం వంటి కారణాలతో ఇవి చనిపోతాయి.

News January 2, 2026

పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం: CBN

image

AP: 22 లక్షల పాసుపుస్తకాల పంపిణీతో ప్రతి ఇంట్లో సంతోషం నెలకొందని CM CBN పేర్కొన్నారు. ‘గత పాలకులు తమ ఫొటోలతో పాసుపుస్తకాలు పంపిణీ చేసి ₹22Cr తగలేశారు. రీసర్వేతో వివాదాలు పెంచారు. మేం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో మేలు చేశాం. లక్ష్యం నెరవేరేలా మంత్రులు చొరవ చూపాలి’ అని టెలికాన్ఫరెన్సులో CM సూచించారు. ఇవాళ ఆరంభమైన పాసుపుస్తకాల పంపిణీ 9వ తేదీ వరకు కొనసాగనుంది. కార్యక్రమంలో ఒకరోజు CM పాల్గొంటారు.