News November 22, 2024
అదానీ లంచాల వ్యవహారం: స్పందించిన తమిళ సర్కారు

Adani Groupతో తమకు ఎలాంటి ప్రత్యక్ష బంధాలు లేవని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECIతో 2021లో యూనిట్ ₹2.61తో 1,500MW Solar Power 25 ఏళ్లపాటు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి సెంథిల్ తెలిపారు. అవినీతిమయమైన గ్రూప్ను BJP ఎందుకు సమర్థిస్తోందని DMK ప్రతినిధి శరవణన్ ప్రశ్నించారు. అదానీపై విచారణ జరిపించే దమ్ముందా అని BJPకి సవాల్ విసిరారు.
Similar News
News December 28, 2025
ఏడవ నేర్చిన వ్యవసాయము

ఒక పనిని ఇష్టం లేకుండా, అయిష్టంగా లేదా ఏడుస్తూ చేస్తే అది ఎప్పటికీ విజయవంతం కాదు. వ్యవసాయం వంటి శ్రమతో కూడిన పనులను ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో చేయాలి. అలా కాకుండా “ఏడుస్తూ” లేదా అయిష్టంగా చేస్తే, ఆ పంట సరిగా పండదు, పైగా అది నష్టాలకే దారితీస్తుంది. ఎవరైనా ఒక పనిని అయిష్టంగా చేస్తే దాని వల్ల ప్రయోజనం లేదని తెలిపే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 28, 2025
TG: ఈ ఆలయాల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి వేడుకలు భద్రాచలంతో పాటు యాదగిరిగుట్ట, ధర్మపురి, హైదరాబాద్ TTD క్షేత్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు. స్వర్ణగిరి వేంకటేశ్వర, చిలుకూరు బాలాజీ ఆలయాల్లో గతంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించారు. శివాలయమే అయినా అనంత పద్మనాభ స్వామి కొలువైనందుకు వేములవాడలోనూ ఉత్తర ద్వార దర్శనాలుంటాయి. స్థానిక వైష్ణవాలయాల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు.
News December 28, 2025
నేడు నాలుగో టీ20.. భారత్కు ఎదురుందా?

శ్రీలంక, భారత మహిళా జట్ల మధ్య ఇవాళ నాలుగో T20 జరగనుంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి 5 T20ల సిరీస్ను టీమ్ఇండియా చేజిక్కించుకుంది. మిగతా 2 మ్యాచుల్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. కనీస పోటీ ఇవ్వడం లేదు. ఈ మ్యాచ్లోనైనా రాణించాలని ఆశిస్తున్నారు. 7PM నుంచి స్టార్ స్పోర్స్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.


