News November 21, 2024
అదానీ కంపెనీ షేర్లు క్రాష్.. ఇన్వెస్టర్లు లబోదిబో

గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదవ్వడంతో అదానీ గ్రూప్ షేర్లు క్రాష్ అయ్యాయి. అదానీ ఎనర్జీ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18.6%, అదానీ ఎంటర్ప్రైజెస్, అంబుజా సిమెంట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ 15%, ఏసీసీ 13%, అదానీ పోర్ట్స్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ 10%, సంఘి ఇండస్ట్రీస్ 7% మేర పతనమయ్యాయి. దీంతో గౌతమ్ అదానీ నెట్వర్త్ రూ.వేలకోట్ల మేర తగ్గినట్టు సమాచారం.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


