News March 28, 2024
ఫారిన్ కరెన్సీ బాండ్లపై అదానీ గ్రూప్ ఫోకస్

ఫారిన్ కరెన్సీ బాండ్ల ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ కోసం $1 బిలియన్ను సమీకరించేందుకు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందట. జూన్ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తికానుంది. మరోవైపు గుజరాత్లోని ముంద్రాలో తొలి కాపర్ రిఫైనరీ ప్లాంట్ను నేడు ప్రారంభించడం ద్వారా మెటల్ ఇండస్ట్రీలోకి అదానీ గ్రూప్ అడుగుపెట్టింది.
Similar News
News November 14, 2025
200 సీట్లతో ఎన్డీయే గెలవబోతుంది: CBN

AP: బిహార్లో ఎన్డీయే ఘన విజయం దిశగా దూసుకెళ్తుండటంపై CM చంద్రబాబు స్పందించారు. విశాఖ CII పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. 200 సీట్లతో ఎన్డీయే గెలవబోతుందని అన్నారు. ప్రజలంతా PM మోదీ వైపే ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు. దేశంలో ఇంతలా ప్రజా నమ్మకం పొందిన వ్యక్తి మోదీ తప్ప మరెవరూ లేరని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ శతాబ్దం నరేంద్ర మోదీది అని కొనియాడారు.
News November 14, 2025
గోపీనాథ్ ‘లీడ్ బ్రేక్’ చేసిన నవీన్

జూబ్లీహిల్స్లో అంచనాలకు మించి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఆయనకు 10 వేలకు అటు ఇటుగా మెజార్టీ రావచ్చని మెజార్టీ సర్వేలు చెప్పాయి. అయితే 9వ రౌండ్ ముగిసేసరికే 19వేల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సెగ్మెంట్లో దివంగత MLA మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ రికార్డ్ విష్ణు (2009లో కాంగ్రెస్ నుంచి 21,741 లీడ్) పేరిట ఉంది.
News November 14, 2025
AcSIRలో 16 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(<


