News June 25, 2024
₹1.3లక్షల కోట్లను ఖర్చు చేయనున్న అదానీ గ్రూప్!

అదానీ గ్రూప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) వ్యాపార వృద్ధి కోసం ₹1.3లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు CFO జుగేషిందర్ సింగ్ వెల్లడించారు. ‘2025 మార్చి నాటికి ₹20వేలకోట్ల ఈక్విటీని సమకూర్చుకోవడమే మా లక్ష్యం. పునరుత్పాదక శక్తిపై అదానీ గ్రీన్ ఈ ఏడాది ₹34వేలకోట్లను వెచ్చించనుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ FY28లో ఎయిర్పోర్టు బిజినెస్లను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేస్తుంది’ అని తెలిపారు.
Similar News
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<
News September 18, 2025
త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్: CEA

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.