News November 21, 2024
డాలర్ బాండ్ల జారీ విరమించుకున్న అదానీ

రూ.5000 కోట్ల విలువైన డాలర్ బాండ్ల జారీని నిలిపివేస్తున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు NSEకి లేఖ రాసింది. న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో అభియోగాలు నమోదవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్ను విస్తరించేందుకు విదేశాల్లో నిధులు సమీకరించాలని అదానీ గ్రూప్ భావించింది. ఇందుకోసం డాలర్ డినామినేషన్లో బాండ్ల జారీకి సిద్ధమైంది. ఈ కేసుతో ఆ దారి మూసుకుపోయింది.
Similar News
News February 20, 2026
రూ.10 కోట్లు ఇవ్వు.. రణ్వీర్ సింగ్కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్కు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన హ్యారీ బాక్సర్ రణ్వీర్ మేనేజర్ వాట్సాప్ నంబర్కు వాయిస్ నోట్ పంపాడని NDTV పేర్కొంది. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలోని ఆ నంబర్, మరింత సమాచారం కోసం అమెరికా పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా హీరోకు భద్రతను పెంచనున్నారు.
News February 20, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News February 20, 2026
పురుగు మందులను కొంటున్నారా?

పంటల్లో చీడపీడల నివారణకు పురుగు మందులను కొనేటప్పుడు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోండి. ఒకే మందు పొడి మందుగాను, నీటిలో కరిగే ద్రావణంగాను, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. అవసరాన్ని బట్టి అంటే ఆశించిన పురుగు లేక తెగులును బట్టి, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను అనుసరించి నిపుణుల సూచనతో మందును కొనాలి. షాపు యజమాని నుంచి రసీదును తప్పక తీసుకోవాలి. కొనేమందు పురుగుల మందు డబ్బా గడువు తేదీని చూసి తీసుకోవాలి.


