News August 12, 2024
రికవరీ బాటలో అదానీ స్టాక్స్.. లాభాల్లోకి మార్కెట్లు

ఉదయం నష్టాల్లో మొదలైన సూచీలు మధ్యాహ్నం లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 350 పాయింట్ల నష్టం నుంచి 200 పాయింట్ల లాభాల్లోకి చేరుకుంది. 79900 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 50 పాయింట్లు ఎగిసి 24413 వద్ద చలిస్తోంది. అదానీ గ్రూప్ స్టాక్స్ రివకరీ అయ్యాయి. నష్టాలు 7 నుంచి 4 శాతానికి తగ్గాయి. స్టాక్ మార్కెట్లపై హిండెన్బర్గ్ ప్రభావం కనిపించలేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాటజిస్ట్ విజయ్ అన్నారు.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


