News October 3, 2024
ADB:డిజిటల్ కార్డుల సర్వేను సమర్ధవంతంగా చేపట్టాలి: కలెక్టర్

ఈ నెల 3వ నుంచి డిజిటల్ కార్డుల సర్వేను సమర్ధవంతంగా చేపట్టాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్ వార్డు, గ్రామ పంచాయతీని ఫైలెట్ ప్రాజెక్ట్ గా సర్వే బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈనెల 8 తేదీ వరకు సర్వే పూర్తిచేయాలన్నారు.
Similar News
News February 25, 2026
కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం: ఆదిలాబాద్ MLA

విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
News February 24, 2026
ఆదిలాబాద్: లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసులు ఎక్కువ పరిష్కరించేలా దృష్టి పెట్టాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్ రావు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు హల్లో మంగళవారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గత లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పాలన అధికారులు

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు (జీపీఓలు) కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామల దేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జీపీఓ, ఆర్ఐ యాప్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా సేవలందించిన వారిని గ్రామ పాలన అధికారులుగా నియమించి గ్రామ స్థాయిలో జరిగే అంశాలను ప్రభుత్వానికి అందజేస్తూన్నట్లు తెలిపారు.


