News February 11, 2026
ADB: అడవిని తలపించిన మోడల్ పోలింగ్ కేంద్రం

మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ పట్టణంలోని 47వ వార్డు సైన్స్ డిగ్రీ కళాశాలలో అడవిని తలపించేలా మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. వన్యప్రాణుల సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, నోడల్ అధికారి స్మిల్కాతో కలిసి పరిశీలించారు. వినూత్నంగా రూపొందించిన ఈ కేంద్రం ఓటర్లలో ఆసక్తిని రేకెత్తించింది.
Similar News
News March 17, 2026
అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మంగళవారం ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. శాఖల వారీగా సంబంధిత పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. నీటి వనరుల సమర్థ వినియోగం, సాగునీటి సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. నేషనల్ హైవేస్, ఎనర్జీ శాఖల పనులను సమీక్షించారు.
News March 17, 2026
సూర్యాపేట: కార్యాలయ నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణ, క్రమశిక్షణ పక్కాగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి అధికారి సమయపాలన పాటించాలని, ‘ఫేస్ అటెండెన్స్’ యాప్లో హాజరు నమోదు చేయాలని సూచించారు. పెండింగ్ ఫైళ్లు, ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు.
News March 17, 2026
‘ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే యుద్ధం’.. అమెరికా ఉన్నతాధికారి రాజీనామా

ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా నేషనల్ కౌంటర్టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్.. ట్రంప్కు షాకిచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇరాన్తో అమెరికా యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. మన దేశానికి ఇప్పటికిప్పుడు ఇరాన్తో ఎలాంటి ముప్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఇజ్రాయెల్, బలమైన అమెరికన్ లాబీ ఒత్తిడి వల్లే అమెరికా యుద్ధంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది’ అని పేర్కొన్నారు.


