News March 28, 2024
ADB: అనారోగ్యంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్లో జరిగింది. ఎస్ఐ ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడకి చెందిన శివయ్య(48) పాల వ్యాపారం చేస్తూ జీవించేవాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మనస్తాపం చెంది గురువారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి: ADB కలెక్టర్

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోని జిల్లాలో వంద పోలింగ్ శాతం నమోదుకు భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మాజీ సైనికుల సంఘాల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
News February 9, 2026
గ్రీవెన్స్ డే ఫిర్యాదులపై స్పందించాలి: ADB SP

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో SP అఖిల్ మహాజన్ బాధితుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, భూ తగాదాలు, పెండింగ్ కేసులపై స్పందించిన ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్కు పంపవచ్చని సూచించారు.
News February 9, 2026
ADB: ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మైకులు మూగబోవడంతో ఒకసారిగా పట్టణంలో వాతావరణం ప్రశాంతంగా మారింది. చివరి రోజున రాజకీయ నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. గత రెండు వారాలుగా ఎన్నికల ప్రచారంతో గల్లీలో సందడి వాతావరణం కనిపించింది. ఏ వీధి చూసిన ప్రచార హోరు కనిపించింది. మరోవైపు సాయంత్రం 5గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.


