News April 3, 2024

ADB: అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడిపై వేటు

image

అనుమతి లేకుండానే విదేశీ పర్యటనకు వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాద్యాయుడు మహేందర్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ప్రణీత మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్చి నెల 9 నుంచి 14 వరకు స్కూల్ అసిస్టెంట్ మహేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లారని ఆయనపై పీఆర్టీయూ తెలంగాణ యూనియన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతడిపై విచారణ జరిపించి వేటువేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Similar News

News November 18, 2025

ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

image

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 18, 2025

ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

image

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 18, 2025

ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

image

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.