News December 28, 2024

ADB: ఆదివారం కాంటాక్ట్ కం కౌన్సిలింగ్ తరగతులు

image

డా. BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3 ,5 సెమిస్టర్ విద్యార్థులకు కాంటాక్ట్ కం కౌన్సిలింగ్ తరగతులను ఈనెల 29న ఆదిలాబాద్ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ శనివారం పేర్కొన్నారు. పీజీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

Similar News

News January 20, 2025

నార్నూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో కుమ్రం మల్కు మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. గుడిహత్నూర్ సూర్యపేట గ్రామంలో నుంచి జంగుబాయి దైవదర్శనానికి వెళ్తున్న గ్రామస్థుల ఐచర్ వ్యాన్ ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా మల్కు మృతిచెందగా.. పలువురు చికిత్స పొందుతున్నారు.

News January 20, 2025

నార్నూర్ ఘాట్ రోడ్డు భద్రతపై ముందే హెచ్చరించిన Way2news

image

నార్నూర్ నుంచి మలంగి గ్రామానికి వెళ్లే దారిలో వచ్చే ఘాట్ రోడ్డు భద్రతపై Way2news ముందే  హెచ్చరించింది. ఇటీవల రోడ్డు ప్రమాదకర స్థితిలో ఉందని పలు కథనాలు ప్రచురించింది. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆదివారం ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రజలు Way2news కథనాలపై చర్చించుకున్నారు. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని పేర్కొంటున్నారు.

News January 20, 2025

బాసర: ఫిబ్రవరిలో వసంత పంచమి వేడుకలు

image

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ అర్చక వైదిక బృందం,అధికారులు ఫిబ్రవరి 01.02.2025 నుండి 03.02.2025 వరకు అమ్మవారికి విశేష పూజలు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించనున్నారు.