News March 19, 2025
ADB: ఉపాధి పని ప్రదేశంలో వాటర్ బెల్

వేసవిలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనులు చేసేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఓను ఆదేశించినట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో రక్షణ కల్పించేందుకు ఉపాధి పథకంలో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పనులకు హాజరయ్యే కూలీలకు గంటకోసారి నీళ్ళు తాగేలా పని ప్రదేశంలో చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 4, 2025
అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోండి: సీఎం

గ్రామాలను అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి అడ్డుకునే వారు, పంచాయితీలు పెట్టే వారితో గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని హితవు పలికారు. ఏకగ్రీవం చేసుకునే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
News December 4, 2025
KCR కుటుంబంలో పైసల పంచాయితీ: సీఎం

ప్రజల సొమ్ము తిన్న వారు ఎవరు బాగుపడరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలు అడ్డగోలుగా సంపాదించిన BRS పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ఇప్పుడు KCR కుటుంబంలో పైసల పంచాయితీ నడుస్తుందని ఎద్దేవా చేశారు. కొడుకు KTR ఒకవైపు, బిడ్డ కవిత మరో వైపు, KCR ఫామ్ హౌస్లో ఉన్నారని విమర్శించారు.
News December 4, 2025
ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి: CM

ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవార ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చేవి కావని గుర్తు చేశారు. సచివాలయానికి రానివ్వకుండా తనను, మంత్రి సీతక్కను అడ్డుకున్నారని తెలిపారు.


