News January 31, 2025
ADB: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని భరంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న మహేందర్ యాదవ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆదిలాబాద్ DEO నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అదే పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలితో సదరు ఉపాధ్యాయుడు అసభ్యకర పద జాలముతో వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News March 1, 2025
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఆదిలాబాద్ వాసులు భయపడుతున్నారు. ఆదిలాబాద్లో ఇవాళ, రేపు 36 °C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News March 1, 2025
ఆదిలాబాద్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

ఈనెల 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా..18,880 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఫస్ట్ ఇయర్లో 9,106 మంది, సెకండ్ ఇయర్ లో 9,774 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 2 సెట్టింగ్ స్క్వాడ్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. వీరితోపాటు హైపవర్ కమిటీని నియమించారు.
News March 1, 2025
‘ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

ఎలాంటి పొరపాట్లు, కాపీయింగ్కు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం,అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు