News April 5, 2024

ADB: ఎన్నికల విధుల్లో 10,489 మంది ఉద్యోగులు

image

ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో విధులు నిర్వహించాల్సిన ఎన్నికల ఉద్యోగులకు ఇప్పటికే తొలి విడత శిక్షణ పూర్తి కాగా వారంతా పోస్టల్ బ్యాలెట్‌ వినియోగించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని 2,111 పోలింగ్‌ కేంద్రాలకు మొత్తం 10,489 మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఇందులో 55 ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఎంపిక చేశారు. ఎన్నికల నిర్వహణలో వీరంతా భాగస్వాములు కానున్నారు.

Similar News

News January 25, 2025

27 నుంచి ప్రతి మండలంలో ప్రజావాణి: ADB కలెక్టర్

image

ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా ప్రజావాణి కార్యక్రమం ఇక నుంచి ప్రతి రోజూ మండలంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ నెల 27 నుంచి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ, ఉపాధి హామీ, పెన్షన్, రేషన్ కార్డులు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై దరఖాస్తులు ఆయా మండలాల్లో కార్యాలయ అర్జీలను సమర్పించాలన్నారు.

News January 24, 2025

రైల్వే జీఎంను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ నగేష్

image

సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ విషయాలపై రైల్వే జిఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.

News January 24, 2025

ADB: JAN 28 నుంచి కందుల కొనుగోళ్లు

image

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేది నుంచి కందుల కొనుగోలు ప్రారంభమవుతాయని మార్క్ ఫెడ్ డీఏం ప్రవీణ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 30 నుంచి జైనథ్ మార్కెట్ యార్డ్‌లో సైతం కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి కందులను మార్కెట్ యార్డుకు తీసుకొని రావాలని సూచించారు.