News March 5, 2025

ADB: ఎమ్మెల్సీ కౌంటింగ్.. 23 మంది ఎలిమినేట్

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అధికారులు చేయనున్నారు. లెక్కింపునకు ముందు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికి 23 స్వతంత్ర అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Similar News

News December 1, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

image

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్‌లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.

News December 1, 2025

ఆత్మకూరులో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

image

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సోమవారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన రూ.15 కోట్ల చొప్పున ఆత్మకూరు, అమరచింత నగర అభివృద్ధి పనులకు, రూ.22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి భవనానికి, రూ.121.92 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

News December 1, 2025

మహబూబాబాద్ డీఈఓగా రాజేశ్వర్ బాధ్యతల స్వీకరణ

image

జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈఓగా పనిచేసిన దక్షిణామూర్తి వీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో, విద్యాశాఖ ఏడీగా ఉన్న రాజేశ్వర్‌ను డీఈఓగా నియమించారు. జిల్లా విద్యాశాఖ సిబ్బంది, పలువురు నూతనంగా బాధ్యతలు తీసుకున్న రాజేశ్వర్‌రావుకు అభినందనలు తెలిపారు.