News February 11, 2025
ADB: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన జర్నలిస్ట్

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదిలాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పులగం దేవిదాస్ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే జర్నలిస్టులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 25, 2025
ADB: అక్రెడిటేషన్ గడువు పొడగింపు

మీడియా అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31 వరకు ముగియనున్న నేపథ్యంలో వాటి గడువు మరో మూడు నెలలు పొడగించినట్లు ఆదిలాబాద్ పౌర సంబంధాల అధికారిణి తిరుమల పేర్కొన్నారు. గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలోని పాత్రికేయుంతా మంగళవారం నుండి అక్రెడిటేషన్ కార్డ్స్ పై స్థిక్కర్లు వేయించుకోవాలి కోరారు.
News March 25, 2025
ADB జిల్లా వ్యాప్తంగా పోలీసులు మీకోసం

ప్రజలకు మంచి పోలీసు సేవలను అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్టేషన్ SHOలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, ప్రతి పోలీసుకు క్రమశిక్షణ తప్పనిసరి అని సూచించారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను, మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని, ‘పోలీసు మీకోసం’ కార్యక్రమాలు కొనసాగాలన్నారు.
News March 24, 2025
ADB: కిషన్ రెడ్డిని కలిసిన MRPS జిల్లా అధ్యక్షుడు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో MRPS జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న దండోరా ఉద్యమానికి మొదటి నుంచి అండగా ఉండి కేంద్ర పెద్దలను కిషన్ రెడ్డి ఒప్పించారని మల్లేశ్ అన్నారు. అనంతరం ఆయన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాలువతో సత్కరించారు.