News February 17, 2025
ADB: ఎస్సీ వర్గీకరణ బిల్లు సవరించాలని మంత్రికి వినతి

ఎస్సీ వర్గీకరణ బిల్లును సవరించాలని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆదిలాబాద్లో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. షెడ్యూల్ క్యాస్ట్ అని విభజించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. రత్నజాడే ప్రజ్ఞ కుమార్, తదితరులున్నారు.
Similar News
News March 23, 2025
ADB: ఇంటివద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్ను ఆదిలాబాద్ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. శనివారం ఆమె కౌంటర్ను ప్రారంభించారు. భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే కార్గో సేవల ద్వారా మీ ఇంటి వద్దనే తలంబ్రాలు అందజేస్తామన్నారు.
News March 23, 2025
ADB: కమాండ్ కంట్రోల్స్ సెంటర్ను పరిశీలించిన ఎస్పీ

ఆదిలాబాద్ డీఎస్పీ కార్యాలయాన్ని, కమాండ్ కంట్రోల్స్ సెంటర్ని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ కార్యాలయంలో విచారణ జరుగుతున్న కేసులపై ఆయన ఆరా తీశారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. కమాండ్ కంట్రోల్స్, సీసీ కెమెరాల తీరును పర్యవేక్షించారు. అంతకుముందు ఎస్పీకి డీఎస్పీ జీవన్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
News March 22, 2025
ADB: పరీక్షకు 23 మంది విద్యార్థులు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,039 మంది విద్యార్థులకు గాను 10,016 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. 23 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించినట్లు వివరించారు.