News February 18, 2025
ADB: కత్తిపోట్ల ఘటన.. UPDATE

తలమడుగు మండలం రుయ్యాడిలో ఓ వ్యక్తి <<15500882>>దారుణ హత్య<<>>కు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో బావబామ్మర్దుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బావ మహేందర్పై బామ్మర్ది అశోక్ కత్తితో దాడి చేశాడు. దీంతో మహేందర్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం రిమ్స్కు తరలించారు.
Similar News
News December 22, 2025
ఎస్పీ గ్రీవెన్స్కు 32 ఫిర్యాదు: ADB ఎస్పీ

పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 32 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల ఫిర్యాదు కోసం ప్రజలు 8712659973 నంబర్కు వాట్సప్ ద్వారా సమాచారం అందజేయాలని వివరించారు.
News December 22, 2025
మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన జోగు రామన్న

ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మాజీ మంత్రి జోగురామన్న కలిశారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కోరారు. అదేవిధంగా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు జోగురామన్న తెలిపారు.
News December 21, 2025
ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


