News February 18, 2025

ADB: కత్తిపోట్ల ఘటన UPDATE

image

తలమడుగు మండలం రుయ్యాడిలో ఓ వ్యక్తి <<15500882>>దారుణ హత్య<<>>కు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో బావబామ్మర్దుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బావ మహేందర్‌పై బామ్మర్ది అశోక్ కత్తితో దాడి చేశాడు. దీంతో మహేందర్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాలు నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Similar News

News December 2, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

image

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలను నేడు TTD విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి 24 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1.8 లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు ఇవాళ మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

News December 2, 2025

US, UK ఒప్పందం.. ఔషధాలపై ‘0’ టారిఫ్

image

అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. UK నుంచి USకు ఎగుమతి అయ్యే ఔషధాలపై సున్నా టారిఫ్‌లు అమలయ్యేలా ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. దీనికి బదులుగా ఔషధాల ఆవిష్కరణలకు అమెరికాలో యూకే 25శాతం అధిక పెట్టుబడులు పెట్టనుంది. దీంతో అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఏటా కనీసం 5బిలియన్ డాలర్ల విలువైన UK ఔషధాలు టారిఫ్ లేకుండా USలోకి ఎగుమతి అవుతాయి.

News December 2, 2025

నేడు భౌమ ప్రదోషం.. శివానుగ్రహం కోసం ఈరోజు సాయంత్రం ఏం చేయాలంటే?

image

త్రయోదశి తిథి, మంగళవారం కలిసి వచ్చిన సందర్భంగా ఈరోజును ‘భౌమ ప్రదోషం’గా పరిగణిస్తారు. ఈ శుభ దినాన సాయంత్రం శివ పార్వతులను పూజిస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి, అభిషేకాలు నిర్వహిస్తే.. మనోభీష్టాలు నెరవేరతాయని నమ్మకం. బిల్వ, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు సమర్పించి, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు.