News February 18, 2025
ADB: కత్తిపోట్ల ఘటన UPDATE

తలమడుగు మండలం రుయ్యాడిలో ఓ వ్యక్తి <<15500882>>దారుణ హత్య<<>>కు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో బావబామ్మర్దుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బావ మహేందర్పై బామ్మర్ది అశోక్ కత్తితో దాడి చేశాడు. దీంతో మహేందర్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాలు నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు.
Similar News
News November 28, 2025
తండాల్లో ఏకగ్రీవాల జోరు.. రుద్రంగి(M)లో 4 పంచాయతీలు ఏకగ్రీవం

సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలంలో ఇప్పటివరకు నాలుగు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల స్వీకరణ తొలిరోజు గురువారం ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. గైదిగుట్ట తండా సర్పంచ్గా ఇస్లావత్ కిషన్, వీరుని తండా సర్పంచ్గా గుగులోత్ మంజుల, చింతామణి తండా సర్పంచ్గా గుగులోత్ సింధుజ ఏకగ్రీవం అయ్యారు. ఇక బుధవారం రూప్లానాయక్ తండా సర్పంచ్గా భూక్య జవహర్లాల్ను గ్రామస్థులు ఏకగ్రీవం చేశారు.
News November 28, 2025
కరీంనగర్: పాండే ప్రస్థానం.. స్ఫూర్తిదాయకం..!

వెటరన్ ఆల్రౌండర్ శిఖా పాండే రూ.2.4కోట్లకు పలకడం గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారిణులకు స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు. ఉమ్మడి కరీంనగర్వాసి శిఖ జిల్లాకే కాకుండా దేశంలోని మహిళా క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక గ్రామీణ క్రీడాకారిణుల్లోని ప్రతిభను గుర్తించడంలో WPL బెస్ట్ ఈవెంటనే చెప్పాలి. భవిష్యత్తులో మరింతమంది మన ప్రాంతం నుంచి భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు శిఖ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.
News November 28, 2025
కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

AP: పాడి ఉత్పత్తుల సంస్థ ACE ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ యూనిట్ను ఏర్పాటుచేయనుంది. ఆసియాలోనే తొలిసారి అత్యాధునిక డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఇందుకోసం రూ.305 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్లాంట్లో చిన్నపిల్లలు, పెద్దల ఆరోగ్యం, పోషణకు దోహదం చేసే ఉత్పత్తులను తయారుచేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయనుంది.


