News March 24, 2025

ADB: కిషన్ రెడ్డిని కలిసిన MRPS జిల్లా అధ్యక్షుడు

image

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో MRPS జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న దండోరా ఉద్యమానికి మొదటి నుంచి అండగా ఉండి కేంద్ర పెద్దలను కిషన్ రెడ్డి ఒప్పించారని మల్లేశ్ అన్నారు. అనంతరం ఆయన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాలువతో సత్కరించారు.

Similar News

News December 3, 2025

విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ ఎంపిక

image

ADB జిల్లాకు చెందిన యువ క్రికెటర్‌ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు కశ్యప్‌కు అభినందనలు తెలిపారు.

News December 3, 2025

విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ ఎంపిక

image

ADB జిల్లాకు చెందిన యువ క్రికెటర్‌ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు కశ్యప్‌కు అభినందనలు తెలిపారు.

News December 3, 2025

ADB: సీఎం రేవంత్ పర్యటనపైన ప్రగతి ఆశలు

image

సీఎం రేవంత్ రెడ్డి రేపు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సీఎం పర్యటనతో జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. బాసర ఆలయం, కుంటాల జలపాతం, జైనథ్ టెంపుల్ అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, సమస్యలపై సీఎం స్పందిస్తే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇలా జిల్లాకి ఇంకేం కావాలో కామెంట్ చేయండి.