News February 26, 2026

ADB: గిరిజన భూములపై గిరిజనేతరుల ‘పాగా’

image

షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూములకు రక్షణ లేకుండా పోతోంది. 1/70 చట్టం అమలులో ఉన్నా ఉమ్మడి జిల్లాలోని భూములను గిరిజనేతరులు కబ్జా చేస్తున్నారు. గిరిజనుల పేర్లతోనే బినామీ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తూ సుమారు 1000 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. ITDA, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో గిరిజన హక్కులు కాలరాస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 16, 2026

NTR: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ క్లిప్ పెట్టుకోవాలి

image

బైక్ నడిపేవారు హెల్మెట్‌కు ఉండే క్లిప్‌ను తప్పనిసరిగా పెట్టుకోవాలని సీపీ రాజశేఖరబాబు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారిక X ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. క్లిప్ పెట్టుకోకుండా హెల్మెట్ ధరించడం అంటే ప్రమాద సమయంలో అది తల నుంచి జారిపోవడానికి అవకాశం ఇవ్వడమేనన్నారు. ప్రాణాలను కాపాడేది సరిగా పెట్టుకున్న హెల్మెట్ మాత్రమేనన్న విషయం వాహనదారులు గుర్తుంచుకోవాలన్నారు.

News April 16, 2026

గుంటూరు జిల్లాలో ఎరువుల నిల్వలు పుష్కలం: JDA

image

గుంటూరు జిల్లాలో 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జె.డి.ఎ. పద్మావతి స్పష్టం చేశారు. యూరియా, డి.ఏ.పీ, తదితర ఎరువులను అందుబాటులో ఉంచినట్లు డీలర్ల సమావేశంలో వెల్లడించారు. బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, పోలీస్, రెవెన్యూ శాఖలతో కలిసి ప్రత్యేక నిఘా పెట్టినట్లు హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందకుండా సాగుకు సిద్ధం కావాలని సూచించారు.

News April 16, 2026

గుంటూరు జిల్లాలో ఎరువుల నిల్వలు పుష్కలం: JDA

image

గుంటూరు జిల్లాలో 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జె.డి.ఎ. పద్మావతి స్పష్టం చేశారు. యూరియా, డి.ఏ.పీ, తదితర ఎరువులను అందుబాటులో ఉంచినట్లు డీలర్ల సమావేశంలో వెల్లడించారు. బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, పోలీస్, రెవెన్యూ శాఖలతో కలిసి ప్రత్యేక నిఘా పెట్టినట్లు హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందకుండా సాగుకు సిద్ధం కావాలని సూచించారు.