News February 20, 2025

ADB: గుండెపోటుతో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మృతి

image

ఆదిలాబాద్ జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బొంపెల్లి భూమన్న (59) గుండెపోటుతో మృతి చెందారు. ఆదిలాబాద్‌లోని వికలాంగుల కాలనీలో నివాసముంటున్న భూమన్న బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా భూమన్న ఆకస్మిక మరణంతో గంగపుత్ర సంఘం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Similar News

News March 27, 2025

దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

image

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!

News March 27, 2025

ADB: శిక్షణ, ఉపాధి కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

అదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, మైనార్టీ యువకులకు టెలి హెల్త్ సర్వీస్ కోఆర్డినేటర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఉచిత భోజన వసతులతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి ఆసక్తి గలవారు ఈ నెల 28న అన్ని ధ్రువీకరణ పత్రాలు, పాస్ ఫోటోలతో ఆదిలాబాద్ టీటీడీసీలో హాజరు కావాలని సూచించారు.

News March 27, 2025

ADB: జాతీయస్థాయి టోర్నీకి రితీక

image

బిహార్‌లో నేటి నుంచి 30 తేదీ వరకు జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ పోటీలకు తెలంగాణ బాలికల జట్టుకు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారిణి జాబడే రితీక ఎంపికయ్యారు. జాతీయస్థాయి టోర్నీకి రితీక ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ గోడం నగేశ్, ఛైర్మన్ పాయల్ శంకర్, అధ్యక్షుడు రఘుపతి, ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!