News March 5, 2025
ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News March 6, 2025
దేశం పేరు వినలేదన్న ట్రంప్… ‘లెసోతో’ దేశం ప్రత్యేకతలివే…!

ఆఫ్రికాలోని ఈ దేశంలో గ్రామాలు చాలా ఎత్తులో ఉంటాయి. అక్కడికి వెళ్లాలంటే కాలినడక, గుర్రాలే మార్గం. తెల్లబంగారంగా పిలిచే ఇక్కడి నీటిని సౌతాఫ్రికాకు ఎగుమతి చేస్తారు. స్కీయింగ్కు బెస్ట్ ప్లేస్. సముద్ర మట్టానికి 3,222 మీటర్ల ఎత్తులో ఉంది. లెవిస్, రాంగ్లర్ బ్రాండ్లకు అవసరమైన జీన్స్ ఇక్కడే కుడతారు. వరల్డ్లోనే అత్యధిక HIVరేటు కలిగిన దేశం. అత్యధిక ఆత్మహత్యల రేటు నమోదయ్యేది
లెసోతోలోనే.
News March 6, 2025
ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

అంబర్పేట్లో నూతన ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయ భవనాన్ని గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పోలీసుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నగర భద్రత కోసం సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఉపయోగాన్ని పెంచాలని సూచించారు. పోలీసులను చూస్తే నేరస్థలకు భయంపుట్టాలని, ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు.
News March 6, 2025
SRH ప్లేయర్కు గాయం.. రీప్లేస్మెంట్ ఎవరంటే?

ఇంగ్లండ్ క్రికెటర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఐపీఎల్-2025కి దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో అతడిని SRH కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడి స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ విల్లెమ్ ముల్డర్ను రూ.75లక్షలకు తీసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ముల్డర్ 11 టీ20లు, 18 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. 60 వికెట్లు తీయడంతో పాటు 970 రన్స్ చేశారు. ఐపీఎల్ 18వ సీజన్ ఈనెల 22న ప్రారంభం కానుంది.