News January 31, 2025

ADB: చేతగానితనానికి నిదర్శనం కేసీఆర్: మంత్రి సీతక్క

image

చేతగానితనానికి నిదర్శనం కేసీఆర్ అని మంత్రి సీతక్క విమర్శించారు. కుంభకర్ణుడిలా ఫామ్ హౌస్‌లో పడుకుంటారని మండిపడ్డారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీకి రాలేదని పేర్కొన్నారు. వందల ఎకరాల ఫాంహౌస్‌లకు రైతుబంధు ఇస్తే తాము.. వరి రైతులకు బోనస్, గ్యాస్‌ను రూ.500 సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మళ్లీ కొత్త పథకాలతో ప్రజలకు మేలు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

జగిత్యాల: సర్పంచ్ స్థానాలకు 508 నామినేషన్లు: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో రెండవ విడత 7 మండలాల్లో రెండవ రోజు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్ స్థానాలకు 508 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. అలాగే వార్డు మెంబర్ స్థానాలకు 1279 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాలకు బీర్పూర్-43, జగిత్యాల-24, జగిత్యాల(R)-103, కొడిమ్యాల-99, మల్యాల-72, రాయికల్-106, సారంగాపూర్-61 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.

News December 2, 2025

జగిత్యాల: ‘ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలనే రాండమైజేషన్’

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది 2వ రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం జగిత్యాల కలెక్టరేట్ లో జనరల్ అబ్జర్వర్ రమేష్ తో కలిసి నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలనే ఉద్దేశంతో రాండమైజేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నమన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.

News December 2, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1911, కనిష్ఠ ధర రూ.1725; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2090, కనిష్ఠ ధర రూ.2000; వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2201, కనిష్ఠ ధర రూ.2131; వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2301, కనిష్ఠ ధర రూ.2281; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3011, కనిష్ఠ ధర రూ.2130గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.