News March 25, 2025
ADB: జిల్లాకు 2 మంత్రి పదవులు..!

రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడిజిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో సమస్యలపై MLAలు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఇతరులను కలవాల్సి వచ్చేది. దీంతో ప్రజల సమస్యలు తీరలేదనే ఆరోపణలున్నాయి. అయితే ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ విడతలో చెన్నూర్ MLA వివేక్, తర్వాత MNCL MLA ప్రేమ్సాగర్రావుకు దక్కనున్నట్లు సమాచారం.
Similar News
News November 17, 2025
హిందువులపై దాడులు బాధాకరం: షేక్ హసీనా

బంగ్లాదేశ్లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోందని మాజీ PM షేక్ హసీనా మండిపడ్డారు. దీంతో వారంతా పారిపోవాల్సి వస్తోందన్నారు. దేశంలో హింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళనలతో హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.
News November 17, 2025
MBNR: యువకుడి దారుణ హత్య.. నలుగురి అరెస్ట్

తమ్ముడి వివాహానికి సహకరించిన అన్నను <<18301281>>హత్య<<>> చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు సోమవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గ్రామంలో కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించనుండగా పోలీసులు భారీగా మోహరించారు. యువతి తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 17, 2025
MANITలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

మౌలానా అజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MANIT)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈ నెల 27వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. ME, M.Tech, M.Arch, మాస్టర్ ఆఫ్ డిజైన్తో పాటు సంబంధిత విభాగంలో PhD పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500. వెబ్సైట్: https://www.manit.ac.in


