News March 5, 2025

ADB జిల్లాలో కరెంట్ షాక్‌తో రైతు దుర్మరణం

image

కరెంట్ షాక్‌తో ఓ రైతు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పార్డి (కే) గ్రామానికి చెందిన ఉగ్గే హన్మంతు (50) తన చేనులో జొన్న పంటకు నీటిని పెట్టేందుకు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో చేను వద్దకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతిని ఇంట్లో విషాదం నెలకొంది.

Similar News

News March 6, 2025

ఆదిలాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకూ అవకాశముందన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.

News March 6, 2025

ADB: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి సిరీయస్

image

మహారాష్ట్రలో బుధవారం జరిగిన <<15659751>>ఘోర రోడ్డు ప్రమాదంలో<<>> జిల్లాకు చెందిన 16 మందికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. గుడిహత్నూర్ మండలం గురిజ గ్రామానికి చెందిన వీరు మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో వీరు ప్రయాణిస్తు వాహనం బోల్తాపడింది.

News March 6, 2025

సిరికొండలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిరికోండలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివరాం వివరాల ప్రకారం.. తుమ్మలపాడ్ గ్రామానికి చెందిన విలాస్(28) ఇంటి గోడకున్నా విద్యుత్‌ వైర్ షాక్ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విలాస్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

error: Content is protected !!