News January 24, 2025

ADB: జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య

image

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా బేల మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైత గోవింద్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాక పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి రూ.5లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.

Similar News

News December 21, 2025

ఆయన ఫెయిలై.. మమ్మల్ని నిందిస్తారేంటి: ఖర్గే

image

అస్సాం విషయంలో PM మోదీ చేసిన <<18631472>>ఆరోపణలపై<<>> కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. ‘కేంద్రం, అస్సాంలో ఆయన ప్రభుత్వమే ఉంది. ప్రజలను రక్షించడంలో వాళ్లు విఫలమైతే ప్రతిపక్షాలను ఎలా నిందిస్తారు? మేం అక్కడ పాలిస్తున్నామా? ఆయన ఫెయిలై.. ప్రతిపక్షంపై తోస్తారు. వాళ్లే విధ్వంసకారులు. మేం కాదు. టెర్రరిస్టులనో, చొరబాటుదారులనో మేం సపోర్ట్ చేయడం లేదు. ప్రజలను కాపాడటంలో విఫలమై మాపై నిందలు వేస్తున్నారు’ అని మండిపడ్డారు.

News December 21, 2025

డైట్ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్

image

కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించి రాత్రి భోజనం వసతిని పరిశీలించారు. వంట గదికి వెళ్లి రాత్రి భోజనానికి సంబంధించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించారా, సన్నబియ్యం నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. కామన్ డైట్ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.

News December 21, 2025

ఇటుకల బట్టీలు వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేసిన Dy DMHO

image

పలాస మండలం బుడంబో కాలనీ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలను డిప్యూటీ డీఎంఎం‌హెచ్ ఓ మేరీ కేథరిన్ వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో పోలియో వ్యాది బారిన పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.