News January 24, 2025
ADB: జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా బేల మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైత గోవింద్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాక పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి రూ.5లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 16, 2025
VJA: రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ACB దాడి

విజయవాడ పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ EE కార్యాలయంలో టెక్నీషియన్గా పనిచేస్తున్న నగేశ్ బాబు లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కాడు. విజయవాడకు చెందిన గుత్తేదారు నాగార్జున నుంచి ధ్రువపత్రం ఇచ్చేందుకు రూ. 15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో ACB అధికారులు పట్టుకుని, నగేశ్ బాబు ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
News December 16, 2025
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,520 తగ్గి రూ.1,33,860కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,400 పతనమై రూ.1,22,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,11,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 16, 2025
EVMలతోనే 4 సార్లు గెలిచా: సుప్రియా సూలే

EVMలపై ప్రతిపక్షాలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్న వేళ NCP(SP) ఎంపీ సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటితోనే తాను 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యానని, అందుకే ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు. LSలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. EVMలు, VVPATలను ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు EVMలను దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు.


