News January 24, 2025

ADB: జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య

image

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా బేల మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైత గోవింద్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాక పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి రూ.5లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.

Similar News

News December 17, 2025

ఎల్లారెడ్డిపేట: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, అల్మాస్ పూర్, గొల్లపల్లి, వీర్నపల్లి మండలంలోని కంచర్ల, వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఆవరణ, కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

News December 17, 2025

కామారెడ్డి జిల్లాలో మూడో విడత తొలి ఫలితం

image

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. అంకోల్ క్యాంప్ సర్పంచ్‌గా అనిత-రాములు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అనితకు 209 మెజారిటీ వచ్చింది. తన సమీప ప్రత్యర్థి సావిత్రికి 36 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు చెల్లలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News December 17, 2025

పెద్దపల్లి జిల్లాలో ఓటింగ్ నమోదు ఎంతంటే..?

image

పెద్దపల్లి జిల్లాలోనీ గ్రామ పంచాయతీలలో ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఒంటి గంటకు పూర్తయింది. పెద్దపల్లి మండలంలో 80.5%, సుల్తానాబాద్ మండలంలో 84.51%, ఎలిగేడు మండలంలో 83.02%, ఓదెల మండలంలో 82.85% నమోదు కాగా, మొత్తం పెద్దపల్లి జిల్లాలో 82.34% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.