News January 23, 2025
ADB: తమ్ముడిని అరెస్ట్ చేశామని ఫోన్

ఆదిలాబాద్ 1 టౌన్లో సైబర్ క్రైమ్ కేస్ బుధవారం నమోదైంది. సీఐ సునీల్ కుమార్ కథనం ప్రకారం.. తిర్పల్లికి చెందిన అఫ్రోజ్ఖాన్కు ఈనెల 16న ఓ కాల్ వచ్చింది. మీ తమ్ముడు తబ్రేజ్ అత్యాచారం కేసులో అరెస్టు అయ్యాడని, అతడిని విడిపించుకోవాలంటే రూ.30వేలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. అతడు వెంటనే వారి ఫోన్ నంబర్లకు నగదు బదిలీ చేశాడు. తర్వాత తమ్ముడు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News February 25, 2026
మనీ ప్లానింగ్ లేకపోతే ఇబ్బందులు తప్పవు: తమన్నా

కెరీర్ ఆరంభంలో తన ఆర్థిక వ్యవహారాలను తండ్రే చూసుకునేవారని హీరోయిన్ తమన్నా వెల్లడించారు. ఆయన నుంచే ఆర్థిక ప్రణాళికలు నేర్చుకొని రియల్ ఎస్టేట్, ఆభరణాలు, ఇతర మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ‘ఇండస్ట్రీలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. యాక్టర్లు చాలా డబ్బు సంపాదిస్తారు. అంతే త్వరగా కోల్పోతారు. అందుకే సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News February 25, 2026
HYD: 21 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ, పేట్లబుర్జూ, కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులతో సహా 21 మంది ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.
News February 25, 2026
నిజామాబాద్: చెవి నొప్పికి ఆపరేషన్.. యువకుడి మృతి

నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల భీంగల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ మృతి చెందాడు. చెవి నొప్పితో వచ్చిన అజయ్కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించింది. మత్తు మందు వికటించడం వల్లే అజయ్ చనిపోయాడని, ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


