News April 10, 2025
ADB: తులం బంగారం కోసం పెళ్లి పందిరిలో నిరసన

రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు.
Similar News
News January 3, 2026
అభ్యర్థులకు ‘టెట్’ తిప్పలు.. ఖమ్మం, హైదరాబాద్లో సెంటర్లు!

జగిత్యాల జిల్లాలో టెట్ అభ్యర్థులకు సొంత జిల్లాలో కాకుండా ఖమ్మం, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో వేయడంతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండు సార్లు కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతం కూడా సెంటర్ చాలా దూరం ఉండటంతో ముఖ్యంగా మహిళలు పరీక్షలకు గైర్హాజరు అవుతున్నారు. టెట్ ఫీజు 1000/- చెల్లించి అంత దూరం వెళ్లలేక మానుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో KNR, JGTL, PDPL సెంటర్లు ఉండగా అక్కడ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
News January 3, 2026
కొత్తగా రైల్వన్ యాప్.. పాత సీజన్ పాస్, వ్యాలెట్ల పరిస్థితేంటి?

UTS(అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్లో లోకల్ రైళ్ల నెలవారీ పాస్ను బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే నిలిపేసింది. రైల్వన్ యాప్ ఉపయోగించాలని చెప్పింది. దీంతో ప్రస్తుత సీజన్ పాస్, R-వ్యాలెట్ బ్యాలెన్స్ ఏమవుతాయోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ‘ఇప్పటికే తీసుకున్న పాస్లు గడువు ముగిసేదాకా చెల్లుతాయి. UTSలో ఇకపైనా జనరల్, ప్లాట్ఫామ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు’ అని రైల్వే క్లారిటీ ఇచ్చింది.
News January 3, 2026
వరి ఉత్పత్తిలో చైనాను దాటేసిన భారత్.. ఎలా సాధ్యమైందంటే?

చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ 152 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే No.1 స్థానానికి చేరింది. చైనాను దాటేయడంలో.. తైవాన్ ఇచ్చిన పొట్టి రకం (TN1) విత్తనాలు మన సాగును మలుపు తిప్పాయి. వీటికి తోడు IR-8, మన దేశీ రకం ‘జయ’ రాకతో ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈ రకాలు నీటి ఎద్దడిని తట్టుకుని నిలబడగలిగాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలకు రైతుల కష్టం తోడవ్వడంతో భారత్ ‘రైస్ కింగ్’గా అవతరించింది.


