News January 27, 2025
ADB: నాగదేవుడు పాలు తాగుతాడనే విశ్వాసం.!

నాగోబాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెస్రం వంశీయులు గోదావరి నుంచి తెచ్చిన జలంతో నాగోబా దేవుడి విగ్రహాన్ని, ఆలయాన్ని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, రాగి ముంతలో పాలు తెస్తారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటిని కొత్త టవల్తో కప్పి పుట్టపై ఉంచుతారు. అయితే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది.
Similar News
News November 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 17, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 17, 2025
పెద్దపల్లి: అన్నను కలిసి వెళ్తుండగా అనంతలోకాలకు

సెలవురోజు కావడంతో అన్నను కలవడానికి వచ్చిన బాలికను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. SI శ్రావణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్(M) తోంగూర్కు చెందిన దాట శివాసిని(8) అన్న దాట శ్రావణ్ సుల్తానాబాద్లోని గురుకులంలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాలకు వచ్చింది. అన్నను కలిసి తిరిగెళ్తుండగా బొలెరో ట్రాలీ ఢీకొనడంతో చనిపోయింది.
News November 17, 2025
నల్గొండలో నూతన డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఈ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, గాదే వినోద్ రెడ్డి, ప్రమీల సహా జిల్లా గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.


