News January 27, 2025
ADB: నాగదేవుడు పాలు తాగుతాడనే విశ్వాసం.!

నాగోబాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెస్రం వంశీయులు గోదావరి నుంచి తెచ్చిన జలంతో నాగోబా దేవుడి విగ్రహాన్ని, ఆలయాన్ని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, రాగి ముంతలో పాలు తెస్తారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటిని కొత్త టవల్తో కప్పి పుట్టపై ఉంచుతారు. అయితే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది.
Similar News
News November 16, 2025
మత సామరస్యానికి ప్రతీక వావరు స్వామి గుడి

వావరు స్వామి అయ్యప్పకు అత్యంత ప్రీతిపాత్రుడైన ముస్లిం భక్తుడు. శబరిమల యాత్రలో, ఎరుమేలిలో ఉన్న వావరు స్వామి ఆలయం మత సామరస్యాన్ని చాటిచెప్పే గొప్ప కేంద్రంగా ఉంది. అయ్యప్ప భక్తులు మొదటగా ఆయనను దర్శించుకోవడం, పక్కనే ఉన్న పేటతుళసి ఆలయంతో ఈ ఆలయం ఉండటం.. హైందవ, ముస్లిం ఐక్యతకు ప్రతీక. వావరు స్వామి ఆలయ దర్శనం, దైవం ముందు అందరూ సమానమే అనే గొప్ప సందేశాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 16, 2025
SIR నిర్వహణకు సిద్ధం కండి: సీఈవో

TG: బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ త్వరలో ఓటర్ల జాబితా సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సన్నాహాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. SIR నిర్వహణకు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు.
News November 16, 2025
మూడో రోజే ముగిస్తారా?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజే ముగిసేలా ఉంది. తొలి ఇన్నింగ్స్లో రెండు జట్లు 200 లోపు స్కోర్లకే ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్లోనూ తడబడిన సౌతాఫ్రికా 93 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం కేవలం 63 పరుగుల లీడ్లో ఉంది. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో మిగతా 3 వికెట్లు ఫస్ట్ సెషన్లోనే పడిపోయే ఛాన్స్ ఉంది.


