News January 27, 2025
ADB: నాగదేవుడు పాలు తాగుతాడనే విశ్వాసం.!

నాగోబాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెస్రం వంశీయులు గోదావరి నుంచి తెచ్చిన జలంతో నాగోబా దేవుడి విగ్రహాన్ని, ఆలయాన్ని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, రాగి ముంతలో పాలు తెస్తారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటిని కొత్త టవల్తో కప్పి పుట్టపై ఉంచుతారు. అయితే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది.
Similar News
News December 8, 2025
భద్రాచలం: పట్టుబడిన సుమారు రూ.కోటి నిషేధిత గంజాయి

కూనవరం రోడ్లో ఎస్ఐ సతీష్ నిర్వహించిన వాహన తనిఖీల్లో 222.966 కేజీల గంజాయి లభ్యమైనట్టు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కూనవరం నుంచి భద్రాచలం వైపుగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు చేయగా ప్రభుత్వ నిషేధిత 110 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.1,11,48,300 ఉంటుందని చెప్పారు. బుచ్చయ్య, రమేష్, షేక్ షఫివుద్దిన్, మహమ్మద్ మోసిన్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
News December 8, 2025
అనకాపల్లి: చిన్నారుల ఆధార్ నమోదును వేగవంతం చేయాలి

జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ఆధార్ కార్డుల నమోదు, నవీకరణపై జిల్లాస్థాయి ఆధార్ కమిటీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ నమోదు చేయాలన్నారు. తల్లి బిడ్డకు జన్మ ఇచ్చిన వెంటనే వైద్యశాలలోనే ఆధార్ నమోదు చేయాలన్నారు.
News December 8, 2025
ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్పై విమర్శలు వ్యక్తమయ్యాయి.


