News January 27, 2025
ADB: నాగదేవుడు పాలు తాగుతాడనే విశ్వాసం.!

నాగోబాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెస్రం వంశీయులు గోదావరి నుంచి తెచ్చిన జలంతో నాగోబా దేవుడి విగ్రహాన్ని, ఆలయాన్ని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, రాగి ముంతలో పాలు తెస్తారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటిని కొత్త టవల్తో కప్పి పుట్టపై ఉంచుతారు. అయితే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది.
Similar News
News November 22, 2025
ADB: ఢీకొట్టాల్సిన వేళ.. డీలాగా..!

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆలస్యం కారణంగా జిల్లాలో కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ సారథి లేకపోతే అభ్యర్థులు గెలిచేదెలా అనే చర్చ మొదలైంది.
News November 22, 2025
వంటింటి చిట్కాలు

– చపాతీ పిండి మిగిలిపోతే దానిపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, గాలి వెళ్లని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
– ఫ్రిజ్లో అక్కడక్కడ కొద్దిగా పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
– కూరల్లో కారం ఎక్కువైతే అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా నెయ్యి వేస్తే కారం తగ్గుతుంది.
– కాఫీ టేస్టీగా రావాలంటే డికాషన్లో చిటికెడు ఉప్పు వేయాలి.
– ఆపిల్ పండ్ల పక్కనే పెడితే అరటి పండ్లు త్వరగా పండుతాయి.
News November 22, 2025
అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కల ‘ధర’హాసం..!

అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కలు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతవారం కిలో రూ.250 ధర ఉండగా శనివారం 300కి చేరిందని స్థానికులు తెలిపారు. అతి చల్లని ప్రదేశాలు ఉన్న చింతపల్లి, పాడేరు, ముంచింగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో కొండలపై గిరిజనులు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో పంటకు తీవ్రంగా నష్టం వచ్చిందని రైతులు అంటున్నారు. దిగుబడి లేక రేటు పెరిగిపోతుందన్నారు.


