News August 1, 2024

ADB: నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణి

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో గురువారం నుంచి ఉచిత బియ్యం పంపిణి ప్రారంభమవుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా రేషన్ కార్డుదారులు ఈ విషయాన్నీ గమనించి తమ సమీప డిపో వద్దకు వెళ్లి బియ్యాన్ని తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 18, 2025

ఇచ్చోడ: పోలీసులపై దాడి.. ప్రధాన నిందితుడి అరెస్ట్

image

కేశవపట్నంలో ఫారెస్ట్ అధికారులు, పోలీసులపై దాడి చేసిన ప్రధాన నిందితుడు షేక్ అల్తాఫ్ అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

News September 18, 2025

ఆదిలాబాద్: అత్యవసరమైతే 8712659953 నంబర్‌కు కాల్ చేయండి!

image

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్& కామర్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.బేగం అన్నారు. గురువారం ఆ కాలేజీలో విద్యార్థులకు ఉమెన్ ఎంపవర్‌మెంట్‌పై అవగాహన కల్పించారు. షీటీమ్ ఇన్‌ఛార్జ్ ఎస్ఐ సుశీల మాట్లాడారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్‌ను యువత అవసరం మేరకే వినియోగించాలన్నారు. ఆడపిల్లలలు అత్యవసర సమయాల్లో 8712659953 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

News September 18, 2025

ఆదిలాబాద్: ‘మిత్తి’మీరుతున్నారు..!

image

అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు అడ్డగోలు దందాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే లక్ష్యంగా.. రుణాలు ఇచ్చేటప్పుడు ఒక రేటు మాట్లాడి తిరిగి తీసుకునేటప్పుడు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులకు బలవుతున్న వారిలో తాజాగా ఇంద్రవెల్లిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో జిల్లా అంతటా పోలీసులు దాడులు చేసి సుమారు 30 మందిపై కేసులు నమోదు చేసినా, తీరు మారడం లేదు.