News February 14, 2025

ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

image

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

Similar News

News December 7, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల కోడ్ తొలగిపోతుందని ఆమె స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News December 7, 2025

ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సేవలన్నింటిని ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తీసుకురావాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ తెలిపారు. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవలపై ఎంపీడీఓలతో కలెక్టర్ శనివారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్ని ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారు. కౌశలంలో పంచాయతీ కార్యదర్శుల సేవలను ప్రశంసించారు.

News December 7, 2025

వెంకటాపురం భార్యాభర్తలు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌

image

వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉపసంహరణ ముగియడంతో గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో సర్పంచ్‌గా శకుంతలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఆమె భర్త వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమై, ఆపై ఉపసర్పంచ్‌గా ఎన్నిక కావడం విశేషం. ఇకపై ఈ భార్యాభర్తలు పదవుల్లో కొనసాగనున్నారు.