News February 14, 2025
ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
Similar News
News December 7, 2025
గోవాకు వెళ్తున్నారా? జాగ్రత్త

2023లో HYD యువతి (30) పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ బస ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో గడిపిన వీడియోలను రికార్డు చేశానని, రూ.30 లక్షలు ఇవ్వకుంటే బయటపెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని చెప్పినా వినట్లేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో NGRIలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News December 7, 2025
మీ పిల్లలను ఇలా మోటివేట్ చేయండి

పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. “నా వల్ల కాదు” అని చెప్పే అలవాటు ఉంటే సరైన ప్రోత్సాహంతో దాన్ని మార్చవచ్చు. ఫలితాలకంటే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. “నీవు చేయగలవు”, “మళ్లీ ప్రయత్నించు” అని చెప్తే సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. వారికి చిన్నచిన్న నిర్ణయాలు సొంతంగా తీసుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల నమ్మకమే పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది అవుతుంది.


