News February 14, 2025
ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
Similar News
News November 18, 2025
HYD: ట్రైన్ డోర్ వద్ద కూర్చుంటున్నారా.. జాగ్రత్త!

రైలు ప్రయాణంలో డోర్ వద్ద కూర్చుని వెళ్తున్నారా?..అయితే అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు. డోర్ వద్ద కూర్చుని ఓ వ్యక్తి మొబైల్ ఆపరేట్ చేస్తుండగా సికింద్రాబాద్ దాటిన తర్వాత ఓ దొంగ ఒక్కసారిగా అతని మొబైల్ గుంజుకొన్నాడు. ట్రైన్ రన్నింగ్లో ఉండటంతో బాధితుడు ఏం చేయలేకపోయాడు. ఇకనైనా డోర్ వద్ద కూర్చోవద్దని, ఇటువంటి ప్రయాణం సురక్షితం కూడా కాదని రైల్వే పోలీసులు సూచించారు.
SHARE IT
News November 18, 2025
బాబా శతజయంతి భద్రత ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. 19న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు జిల్లాకు రానున్న సందర్భంగా.. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా మంత్రి సవిత జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. వీఐపీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించాలన్నారు.
News November 18, 2025
నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్స్పెక్టర్

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


