News February 14, 2025

ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

image

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

Similar News

News March 25, 2025

ప్రియుడి కోసం.. పెళ్లైన 2 వారాలకే భర్తను చంపించిన భార్య

image

భర్తలను భార్యలు చంపేస్తున్న/చంపిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. మీరట్ కేసు మరువక ముందే UP, మైన్‌పురి జిల్లాలో మరో ఘోరం జరిగింది. బలవంతపు పెళ్లి, ప్రియుడిపై ఇష్టంతో పెళ్లైన 2 వారాలకే భర్త దిలీప్ యాదవ్‌ను కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపించింది ప్రగతీ యాదవ్. తన భర్త వద్ద బాగా ఆస్తి ఉందని, చంపేశాక సుఖంగా బతకొచ్చని ప్రియుడికి చెప్పింది. దిలీప్ శవం దొరికాక పోలీసుల దర్యాప్తుతో ప్రగతి ప్లాన్ బయటకొచ్చింది.

News March 25, 2025

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్

image

మోహన్ లాల్ ‘లూసిఫర్’‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్‌ను తాను చూశానని, సినిమాలో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారన్నారు. అయితే లూసిఫర్-2తో గాడ్ ఫాదర్-2 తీయలేరని, ఇందులోని పాత్రలను తీసేయడం అసాధ్యమన్నారు. కాగా ‘L2:ఎంపురాన్’ ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.

News March 25, 2025

సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

image

హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు ముందు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

error: Content is protected !!