News April 6, 2025
ADB: పాలిటెక్నిక్లో ప్రవేశాలకు POLYCET

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 16, 2025
సిడ్నీ దాడి.. నిందితులకు హైదరాబాద్ లింక్!

ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన <<18568131>>తండ్రీకొడుకుల<<>> మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి. ‘సాజిద్ అక్రమ్(50)ది ఓల్డ్ సిటీ. ఇద్దరు సోదరులు, బంధువులు అక్కడే ఉన్నారు. 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల కోసం గతంలో ఇండియాకు వచ్చాడు. అతడి కొడుకు నవీద్కు పుట్టుకతో ఆసీస్ పౌరసత్వం ఉంది’ అని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇండియాతో ఆస్ట్రేలియా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పాయి.
News December 16, 2025
ములుగు: ఎన్నికల సిబ్బంది కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు

జిల్లాలో రేపు జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు వెళ్లిన సిబ్బంది కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తుందని వరంగల్-2 డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. ములుగు బస్టాండ్ నుంచి హనుమకొండ వరకు బుధవారం రాత్రి 10:00, 12:00 గంటలకు, అర్ధరాత్రి ఒంటి గంటకు మూడు ట్రిప్లు నడుపుతున్నామని చెప్పారు. ఈ సౌకర్యాన్ని ఎన్నికల నిర్వహణకు వెళ్లిన సిబ్బంది ఉపయోగించుకోవాలని కోరారు.
News December 16, 2025
విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జునను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మంగళవారం సమాచారం అందింది. గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించిన నాగార్జున ప్రస్తుతం డీసీసీబీ ఛైర్మన్గా ఉన్నారు. ఈ పదవికి పలువురు సీనియర్లు పోటీ పడినా, మరోసారి నాగార్జునకే అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.


