News May 10, 2024
ADB: పోలీసులకు అవగాహన కల్పించిన SP

జిల్లావ్యాప్తంగా ఎన్నికల విధులను నిర్వహించనున్న నూతన శిక్షణ కానిస్టేబుల్ కేంద్ర బలగాలకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలకు 100 మీటర్ల పరిధిలో గూమికూడకుండా, ప్రజలు క్రమబద్ధీకరణతో క్యూలైన్లను పాటిస్తూ ఓటుహక్కును వినియోగించుకునే విధంగా చూడాలని సూచించారు. పోలింగ్ బూత్ లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతి లేదని ఓటర్లకు చెప్పాలన్నారు.
Similar News
News December 17, 2025
ఆదిలాబాద్: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. 100 మీటర్లు, 200 మీటర్ల దూరంలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని తప్పక పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు వంటి వాటికి అనుమతి లేదన్నారు. క్యూ లైన్ పద్ధతి పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.
News December 17, 2025
ఆదిలాబాద్: సమస్యలు సృష్టించే 756 మంది బైండోవర్

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గొడవలు సృష్టించే అవకాశం ఉన్న 756 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను కూడా సేఫ్ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మూడు విడతల బందోబస్తులో ఫారెస్ట్, టీజీఎస్పీ, ఏసీటీపీసీ సిబ్బంది పాల్గొంటున్నారని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
News December 16, 2025
ADB: మూడో దశ ఎన్నికలకు 938 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాలలో జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 37 క్లస్టర్లు, 25 రూట్లలో, 151 గ్రామాల పరిధిలోని 204 పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 938 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.


