News July 19, 2024
ADB: పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంను ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుళ్లకు వడ్డించే ఆహారాన్ని స్వయంగా తిని పరిశీలించి వంటలు నిర్వహించే వారికి సూచనలు చేశారు. ఆహారాన్ని నాణ్యతతో కూడిన వస్తువులతో వండాలని సూచించారు. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు శిక్షణ కాలంలో క్రమం తప్పకుండ హాజరవ్వాలని అన్నారు.
Similar News
News November 1, 2025
ఆదిలాబాద్: నూతన డీఈఓగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు

ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ను నియమిస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వలు జారీ చేశారు. ప్రస్తుత డీఈవోగా పని చేస్తున్న ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పర్సనల్ సెలవుల్లో వెళ్లునున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావుకు నవంబర్ 4 నుంచి ఇన్ఛార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
News October 31, 2025
ఆదిలాబాద్: విద్యతో పాటు సృజనాత్మకత అవసరం: కలెక్టర్

యువత సమాజంలో సానుకూల మార్పు సృష్టించాలంటే విద్యతో పాటు నైపుణ్యాలు, సృజనాత్మకత కూడా అవసరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించి, సామాజిక అభివృద్ధికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ‘బోస్ ఫెలోషిప్’ సామాజిక సంస్థ భారత్ దేకో ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్లో పాల్గొన్నారు. సమాజంలో స్థిరమైన మార్పు రావాలంటే విద్యతో పాటు సమర్థవంతమైన నైపుణ్యాలు కూడా అవసరమన్నారు.
News October 31, 2025
ADB: శిశు మరణాల నివారణకు పని చేయాలి

ఆదిలాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన నవజాత శిశు సంరక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. శిశు మరణాల నివారణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


