News August 9, 2024
ADB: ప్రపంచ ఆదివాసీ దినోత్సవంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు

ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో విద్యార్థులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంపై ఉపన్యాస, వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదివాసీ దినోత్సవ ప్రాముఖ్యతను తెలియచేయాలన్నారు.
Similar News
News November 23, 2025
ఆదిలాబాద్ కాంగ్రెస్ కొత్త సారథి నేపథ్యమిదే

ADB కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా గుడిహత్నూర్ మండలానికి చెందిన నరేశ్ జాదవ్ నియమితులైన విషయం తెలిసిందే. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. AICC మెంబర్గా ఉన్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ అసెంబ్లీ నుంచి బరిలో నిలవాలనుకున్నా టికెట్ ఇవ్వలేదు. అయినా పార్టీలోనే కొనసాగుతూ తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయతతోనే అధ్యక్ష పదవి వచ్చింది.
News November 22, 2025
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.
News November 22, 2025
నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

నార్నూర్లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.


