News September 19, 2024
ADB: ప్రశాంతంగా ముగిసిన గణేష్ ఉత్సవాలు

గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతూ 11 రోజుల పాటు నిద్రాహారాలు మాని విధులను నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే గణపతి మండపాల నిర్వాహకులకు, హిందూ సంఘాలకు, మిలాద్ ఉన్ నబీ ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 21, 2025
ADB: వైద్యుల నిర్లక్ష్యం.. తల్లిబిడ్డ మృతి

గుడిహత్నూర్ మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయి నిన్న పురిటి నొప్పులతో 108 సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు రెండవ కాన్పు సిజేరియన్ చేయగా, డెలివరీ తర్వాత నిన్న రాత్రి తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, బిడ్డ మృతి చెందారని భర్త చిక్రం సుభాశ్ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 21, 2025
ADB: ‘పాఠశాల సమయాన్ని మార్పు చేయాలని కలెక్టర్కు వినతి’

ADB కలెక్టర్ రాజర్షి షాను PRTU ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో పాఠశాల సమయాన్ని మార్చాలని కోరుతూ కలెక్టర్ రాజర్షి షాతో విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్, సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.
News November 21, 2025
ADB: జాతీయ రహదారిని అడ్డుకోవడం చట్టరీత్య నేరం: డీఎస్పీ

జాతీయ రహదారిపై అత్యవసర సేవల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని వాటిని అడ్డుకోవడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని ADB డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. యువత కేసుల బారిన పడకుండా వారి భవిష్యత్తులను నాశనం చేసుకోకూడదని తెలిపారు. అంబులెన్స్, అగ్నిమాపక, వాహనాలు ఆస్పత్రిలకు వెళ్లేవారికి అసౌకర్యం కలిగే చర్యలు చేయవద్దన్నారు. యువత కేసుల వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోకుండా ఉండాలని సూచించారు.


