News February 16, 2025
ADB: బాబా మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి

బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ ప్రకారం.. ఖుర్షీద్ నగర్కు చెందిన అజహర్ ఉద్దీన్కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
Similar News
News January 2, 2026
నేటి నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ

AP: నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాస్ బుక్లను ప్రజాప్రతినిధులు అందించనున్నారు. వాటిలో ఏవైనా తప్పులుంటే యజమానులు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు. పాసు పుస్తకాన్ని స్వర్ణ వార్డు, గ్రామ రెవెన్యూ సిబ్బందికి ఇస్తే తప్పులు సవరించి కొత్త పాస్ పుస్తకాలు అందిస్తారని పేర్కొన్నారు.
News January 2, 2026
ఖమ్మం: అవసరమే ఆసరా.. అడ్డగోలు వసూళ్లు.!

ఖమ్మం జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు చక్రవడ్డీలు, వడ్డీలతో సామాన్యుల రక్తాన్ని పీలుస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరాలను ఆసరాగా చేసుకుని, రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీలు వసూలు చేస్తూ బాధితులను ఆర్థికంగా కుంగదీస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నా, ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధికారులు అక్రమ వడ్డీ మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటున్నారు.
News January 2, 2026
ఉదయగిరి: మళ్లీ పులి వచ్చింది..!

ఉదయగిరి మండలం కొండకింద గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డు, దుర్గం, జి.చెరువుపల్లి అటవీ ప్రాంతాల్లో తిరగడాన్ని తాము చూశామని నాలుగైదు రోజులుగా ప్రజలు చెబుతున్నారు. తాజాగా గురువారం రాత్రి 7గంటల సమయంలో కుర్రపల్లి-కృష్ణాపురం మార్గంలో జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటడాన్ని కృష్ణారెడ్డిపల్లికి చెందిన దేవసాని శ్రీనివాస్ రెడ్డి చూశారు.


