News February 16, 2025

ADB: బాబా మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి

image

బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన అజహర్ ఉద్దీన్‌కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్‌కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News November 24, 2025

సినిమా అప్డేట్స్

image

* రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా DEC 12న జైలర్-2 టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
* ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ సాంగ్‌కు ఇన్‌స్టా, యూట్యూబ్‌లో 500K+ రీక్రియేషన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు.
* గోపీచంద్ మలినేని-బాలకృష్ణ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్.
* ప్రశాంత్ నీల్-జూ.ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో ఎంట్రీ సీక్వెన్స్‌ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు సమాచారం.

News November 24, 2025

MHBD: ఎస్టీలకే అన్ని సర్పంచ్ స్థానాలు!

image

మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని 11 మండలాలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం ఖరారు చేశారు. జిల్లాలోని బయ్యారం (29), కొత్తగూడ (24), గార్ల (20) మండలాల్లోని అన్ని సర్పంచ్ స్థానాలు ఎస్టీ (ST) సామాజిక వర్గానికే రిజర్వ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం వల్ల ఈ మూడు మండలాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఇతర సామాజిక వర్గాల నాయకులకు నిరాశ తప్పలేదు.

News November 24, 2025

నరసరావుపేట: నేతన్నలకు అమలు కానీ ఉచిత విద్యుత్.!

image

చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు ఆగస్టు 7న హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా పథకం అమలు కాలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో కేవలం 280 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి గ్రామాలలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఈ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.