News February 11, 2025

ADB: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా చించ్ ఖేడ్‌కు చెందిన గోటి జితేందర్ బజర్హత్నూర్ మండలానికి చెందిన ఓ బాలికను ముంబైకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

Similar News

News March 25, 2025

వికారాబాద్: ‘ఓవర్సీస్ స్కాలర్షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి’

image

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ద్వారా అర్హులైన ఎస్సీ విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని VKB జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి మల్లేశం తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం అర్హులైన విద్యార్థులకు మే 19 వరకు అవకాశం ఉందన్నారు. https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.

News March 25, 2025

ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలేను భారతరత్నతో సత్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా CM ఫడణవీస్ మాట్లాడుతూ ‘మహాత్మా బిరుదు దేశంలో అన్నింటికన్నా గొప్పది. దీనిని ప్రజలు ఫూలే, గాంధీకి మాత్రమే ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఫూలే దంపతులు 19వ శతాబ్దంలో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.

News March 25, 2025

NRPT: వారికి కలెక్టర్ WARNING

image

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. వారం రోజులలో పనితీరు మెరుగుపర్చుకుని, లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆమె ఆదేశించారు. సోమవారం నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఉట్కూరు, కోస్గి, నారాయణపేట, మద్దూర్, దామరగిద్ద మండలాల అధికారులతో ఉపాధి హామీ, హరితహారం, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!