News August 16, 2024
ADB: బాసర సరస్వతి టెంపుల్లో చోరీ..

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలోని దత్తాత్రేయ మందిరంలో ఉన్న హుండీని బుధవారం అర్ధరాత్రి ఓ దొంగ కొల్లగొట్టాడని స్థానికులు తెలిపారు. రా.10గంటలకు ప్రవేశించిన దుండగుడు ముందుగా అంతరాలయంలోని దత్తాత్రేయ టెంపుల్ హుండీలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందన్నారు. ప్రధాన హుండీని తెరవడానికి యత్నించి విఫలమయ్యాడని, గురువారం ఆలయానికి వచ్చిన సిబ్బంది హుండీలను చూసి పోలీసులకు చెప్పారన్నారు.
Similar News
News November 30, 2025
రెండో విడత నామినేషన్కు విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

నేటి నుంచి రెండో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు ఫారం నంబర్ -1 నుంచి 10 వరకు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ప్రజల నుంచి ఎక్కువ నామినేషన్లు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News November 30, 2025
ఆదిలాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న చలి

ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 24 గంటల్లో నమోదైన వివరాలను అధికారులు వెల్లడించారు. నేరడిగొండ, అర్లిలో 10.3°C, పొచ్చెరలో 10.4°C, సోనాలలో 10.9°C, సాత్నాల, తలమడుగులో 11.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాంసిలో 11.4°C, బేలలో 11.6°C, నార్నూర్లో 12.9°C, ఉట్నూర్లో 14.1°Cగా నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 30, 2025
సిరికొండ: నలుగురు మహిళా సర్పంచ్లు ఏకగ్రీవం

సిరికొండ మండలంలో 7గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులను గ్రామ పెద్దలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. నేరడిగొండ (జి) క్లస్టర్లోని 4గ్రామపంచాయతీలకు నామినేషన్ నిర్వహించగా కుంటగూడ, జెండగూడ, నారాయణపూర్, నేరడిగోండ (జి)లో నలుగురు మహిళలను సర్పంచ్లుగా ఏకగ్రీవం చేశారు.


