News April 3, 2025
ADB: బెల్ట్ షాపులపై పోలీసుల రైడ్.. నలుగురిపై కేసు

ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్, శ్రీరామ్ కాలనీలో బెల్ట్ షాపులపై తనిఖీ నిర్వహించారు. అందులో నలుగురు వ్యక్తులు అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేసినందుకు వారిపై 2 టౌన్ పీఎస్లో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. నాలుగు దుకాణాల్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.15,370 ఉందని పేర్కొన్నారు.
Similar News
News April 12, 2025
ADB: ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
News April 12, 2025
నేరడిగొండలో 52 మందికి TB పాజిటివ్

నేరడిగొండ మండలంలో నెల క్రితం పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. వారిలో మొత్తం 52 మందికి టీబీ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శుక్రవారం హెచ్ఈఓ పవార్ రవీందర్ వెల్లడించారు. శుక్రవారం 25 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. టీబీ బాధితులకు 6 నెలల వైద్యంతో పాటు నెలకు రూ.1000, పోషణ న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నామన్నారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్, సంతోష్, తదితరులున్నారు.
News April 12, 2025
తెలంగాణలో టాప్ 3లో ఉమ్మడి ADB

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,350 మంది బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తలంబ్రాల బుకింగ్లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.